వెండి కిలో రూ. 1.25 లక్షలను ఎప్పటికి తాకుతుంది. ఇన్వెస్టర్లకు ఎంత రాబడి ఇచ్చిందంటే ?
బంగారం, వెండి రేట్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు విలువైన లోహాలకు డిమాండ్ కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. వీటిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ఖజానా గత ఏడాది కాలంగా నిరంతరం నిండుతోంది. దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.81,060గా, వెండి కిలో ధర రూ.1.12 లక్షలుగా ఉంది. ఇప్పుడు వెండి కిలో రూ.1.25 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.86 వేలకు చేరుకుంటుందని ఒక నివేదిక పేర్కొంది. రాబడుల పరంగా వెండి బంగారాన్ని దాటేస్తుందని నిపుణులు అంటున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం.. మధ్యస్థ, దీర్ఘకాలిక రాబడుల పరంగా వెండి బంగారం కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఇది వచ్చే 12 నుండి 15 నెలల్లో MCXలో కిలోకు రూ. 1.25 లక్షలు, COMEXలో కిలోకు 4000డాలర్లని తాకవచ్చు. వెండి ఇప్పటికీ మెరుగైన పనితీరు కనబరిచింది. కిలోకు రూ. 1 లక్ష మార్కును దాటింది. ఇది దాదాపు 40 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. పెట్టుబడిదారులు మాత్రమే దీనిని కొనుగోలు చేయడమే కాకుండా దాని పారిశ్రామిక డిమాండ్ కూడా బలంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
బంగారానికి డిమాండ్ కూడా బలంగానే ఉంటుందని నివేదికలో పేర్కొంది. మధ్యకాలంలో రూ.81 వేలు, దీర్ఘకాలికంగా రూ.86 వేలు టార్గెట్తో కొనుగోలు చేయవచ్చు. ఇది మీడియం టర్మ్లో Comexలో 2,830డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000డాలర్ల ఫిగర్ను తాకగలదు. మోతీలాల్ ఓస్వాల్కు చెందిన మానవ్ మోడ