జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లోని పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కేంద్ర బలగాలతో కలిసి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో సోదాలు జరిగాయి. ఉప ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నగదు నిల్వ చేశారనే ఫిర్యాదులతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ తనిఖీలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. "బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై రైడ్స్ జగుతున్న విషయం నాకు తెలియదు. కక్ష సాధింపు చర్యల ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు వెళుతుంది. రెచ్చగొట్టే విధానం మాది కాదు" అని అన్నారు.
జూబ్లీహిల్స్లో గతంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇప్పుడు వాళ్ల ప్రచారం ఎలా ఉందనే దానిపైనే మేము మాట్లాడుతున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతనైతే జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్లు దక్కేలా చేసుకోవాలి. మా సీఎం, మేము సెక్యులర్ విధానాన్ని పాటిస్తాం. రెచ్చగొట్టి, మతం ఆధారంగా ఓట్లు అడిగే విధానం మాది కాదు" అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుతూ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుతూ ఆ పార్టీ అధినేతలు ప్రచారం సాగించారు. బీజేపీ అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు.
ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో లేదా ఎవరు ఓడిపోతారో అనేది ఓటర్ల చేతిలో ఉంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల ఇళ్లపై సోదాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లోని పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కేంద్ర బలగాలతో కలిసి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో సోదాలు జరిగాయి.
ఈ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది కక్ష సాధింపు చర్యలని బీఆర్ఎస్ నేతలు అన్నారు.