తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ని సభలో కలిసేంత సంస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే అని పేర్కొన్నారు.
గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ కాలేడని, గడ్డాలు పెంచడం చాలా ఈజీ… పాలన చేయడమే కష్టమని కేటీఆర్ అన్నారు. రేవంత్ గడ్డం, మీసాలు లేని నన్ను కాదు రాహుల్ను, రాజీవ్ను అన్నారు. నేను అంధ్రలో చదివితే తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అల్లుడిని ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు.
కేసీఆర్కు రేవంత్ రెడ్డి షేక్హ్యాండ్ ఇవ్వడంపై కేటీఆర్ కామెంట్స్..
అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. కేసీఆర్-రేవంత్ రెడ్డి షేక్హ్యాండ్..
కేసీఆర్-రేవంత్ రెడ్డి షేక్హ్యాండ్: విశేషాలు
తెలంగాణ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య షేక్హ్యాండ్ జరిగింది.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
అసెంబ్లీలో కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన ఈ సంభాషణ చర్చనీయాంశమైంది.
గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా అసెంబ్లీలో జరిగిన షేక్హ్యాండ్తో పాటు కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి చూపిన శ్రద్ధపై కూడా కేటీఆర్ స్పందించారు.
ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే అని అన్నారు.